- 5వ రోజుకు చేరిన స్టాప్ నర్సుల ధర్నా
- పలువురి మద్దత్తు
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తున్న స్టాప్ నర్సులకు గత 7 నెలల నుండి వేతనాలు ఇవ్వకుండా హార్థికంగా మానసికంగా స్టాప్ నర్సులను ఇబ్బందులు పడుతున్నారని భారతీయ జనత పార్టి జిల్లా అద్యక్షులు పాయల శంకర్, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి S విలాస్ ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటల రాములు రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. శనివారం నాడు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి మెన్ గెట్ ముందు ఎఐటియుసి తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ & ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినారు. ఈ దర్న శనివారం నాటికి 5వ రోజుకు చేరింది. 5వ రోజుకు చేరిన స్టాప్ నర్సుల ధర్నాకు పలువురి మద్దత్తు తెలిపినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 లో 300 OCS నిబంధనల ప్రకారం రిక్రూట్ మెంట్ ఐన స్టాప్ నర్సుల 7.నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని సమ్మె చేపట్టడం జరిగింది. రెండు శాఖల సమన్వయము లోపంతో స్టాప్ నర్సులకు వేతనాలు రావడం లేదన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి, రిమ్స్ డైరెక్టర్ లు కలసి చేర్చిన్సుకొని వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేసినారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అద్వర్యంలో పనిచేస్తున్నామ , డి ఎం ఇ అద్వర్యంలో పనిచేస్తున్నామ అన్న విషయం ఇప్పటికి సంక్షోభంలో ఉందన్నారు. రిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తున్న స్టాప్ నర్సులకు వేతనాలు చెల్లించలని ఎన్నో సార్లు అధికారులకు విన్నవించిన పలితం లేదని తెలిపినారు. ప్రభుత్వం 510 జీవో లో నియమితులైన ఆదిలాబాద్ రిమ్స్ స్టాఫ్ నర్స్ ఉన్న ఇబ్బందుల గురించి వేతనాల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు అసలే కరోన సమయం ప్రపంచమంతా ఇబ్బందులు పడుతుందని ఏడు నెలల నుంచి జీతాలు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి ఈ విషయం తెలియదా అని వారు ప్రశ్నించారు ఏడు నెలల నుంచి వేతనాలు లేకపోవడం వల్ల అనేక సమస్యలతో సతమతమవుతున్న ఈ సందర్భంగా వారు తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్టాప్ నర్సులు బి పెర్సి, యం శోభారాణి, జి కవిత,ఎస్ జోష్న,కే శాంత, ఎస్ శ్రీలత, డి బేబీ, ఎన్ కమలాబాయి, వాగ్మరే సారిక, డి పద్మావతి, బి పెర్సి, సి చంద్రకళ, సిహెచ్ ప్రియాంక . కె కరుణ, బి వసంత రాణి, జే జయ, వి పుష్పలత, ఏ సుమలత, ఎ విజయ,జి మీనాక్షి, పి సునీత, వి సంగీత, జి భాగ్యలక్ష్మి, యం అరుణ,డి రాజేశ్వరి,కే రాజ్యలక్ష్మి,డి పుష్పాల, ఎ సునీత, సిహెచ్ వనజ ,కోడూరి వనజ,పి ప్రశాంతి, మీర్జా సన, దుర్వా సునీత, ఆడే స్వప్న బి సవిత, కె సురేఖ, పి సుచరిత, కె కృష్ణకుమారి, జి విశాల, కే వసుంధర, జి త్రిచరణ, కే సురేఖ, ఆర్ వినోద, జాడి సునీత, యం వెంకటలక్ష్మి,ఎహ్ లావణ్య, జి అనురాధ కె.విజయలక్ష్మి ,యు శ్రీలత,జే రాధా తదితరులు పాల్గొన్నారు