సబ్ సెంటర్లకి అద్దె విడుదల

 

కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి):  చాలా కాలం నుండి సబ్ సెంటర్ కు కిరాయి చెల్లించలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయం ను తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘము(TMHEU) ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ కమిసనర్  వాకాటి కరుణ కు  తేదీ 6-11-2020 న సంఘం  అద్వర్యంలో  వినతి పత్రం ఇవ్వడం  జరిగిందని తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘము మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  బోడ అరుణ , రాష్ట్ర కార్యదర్శి రాదిక, వర్కింగ్ ప్రసిడెంట్ రాబర్ట్  బృస్, జనరల్ సెక్రటరి బుర  రవి , దయమని, మమత, శుభాసిని,లతా, ఫ్రాన్సిక , మౌనిఖ, స్వర్ణ కుమారి, సువర్ణ కుమారి, అజీం లు తేపినారు. వెంటనే  స్పందించిన కమిసనర్ 2020-21 సం. నకు 12 నెలల రెంట్ మంజూరు చేస్తూ RC.No.71/SPMU_NHM/TS /2020_21 Dt.30_12_2020  ఉత్తర్వులు జారీచేశారు. రూ.3కోట్ల51 లక్షల రూపాయలు విడుదల చేశారరాణి వారు పేర్కొన్నారు. స్పందించిన కమిషనర్ వాకాటి కరుణ మేడంకు వారు  కృతజ్ఞతలు తెలిపినారు.