కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451
కామారెడ్డి,(ఆరోగ్యజ్యోతి): పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా
బాన్సువాడ, బీర్కుర్, నసరుల్లాబాద్ మండలాల పరిధిలోని అండన్వాడీ
టీచర్లు, ఆయాలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడారు. గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తే పుట్టబోయే పిల్లలు
సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. పుట్టినప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటే..
జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ప్రభుత్వం మహిళలకు అంగన్వాడీ కేంద్రాల
ద్వారా పోషకాహారం అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంతోనే సుఖ
ప్రసవాలు పెరిగాయన్నారు. 70శాతం నార్మల్ డెలివరీలు, 30 శాతం ఆపరేషన్లు జరుగుతున్నాయన్నారు. బాన్సువాడ పట్టణంలో మాతాశిశు ఆసుపత్రిని
రూ.20కోట్లతో నిర్మించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో నిజామాబాద్ డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.