కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
హైదరాబాద్
(ఆరోగ్యజ్యోతి): మూడుకాళ్లతో జన్మించిన మేక, ఏనుగు తొండంతో జన్మించిన
వరాహం అంటూ అప్పడప్పుడు వింత జంతవులు జననం గురించి మనం వింటుంటాం. అయితే, తాజాగా హైదరాబాద్లో ఓ మహిళకు వింత శిశువు జన్మించింది. హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో వింత శిశువుకు ఓ మహిళ
జన్మనిచ్చింది. అయితే నవజాత శిశువు
పుట్టిన 2 గంటలకే ప్రాణాలు కోల్పోయింది. వివారాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లాకు
చెందిన ఓ గర్భిణికి నెలలు నిండటంతో ప్రసవం కోసం పేట్లబురుజు ఆస్పత్రికి బుధవారం
సాయంత్రం వచ్చింది. గర్భిణి ప్రసవించిన బిడ్డను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆ శిశువు నడుము
పైభాగం వరకు బాగానే ఉన్నప్పటికీ.. కింది భాగం చేప ఆకారాన్ని పోలి ఉంది. జననేంద్రియాలు, కాళ్లు అభివృద్ధి చెందలేదు. జన్యుపరమైన లోపాల
వల్లే ఈ రకమైన శిశువులు జన్మిస్తారని వైద్యులు తెలిపారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయన్నారు. ప్రస్తుతం తల్లి
ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.