వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

        కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

హైదరాబాద్,(ఆరోగ్య జ్యోతి):తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న మెడికల్, పార  మెడికల్ సిబ్బంది కేంద్ర రాష్ట్రాల పథకాల లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డైరెక్టర్ ఆప్ మెడికల్ కు వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక డాక్టర్ రవి శంకర్ ప్రజాపతి, డాక్టర్ సత్తి జనార్ధన్, ఆర్ సుజాత, భూపాల్, శిరీష, సుజాత లు మాట్లాడుతూ వైద్య ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే  పరిష్కారం కోసం ఐక్యంగా అన్ని సంఘాలు కలిసి వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న అన్ని స్థాయిల్లో అన్ని రకాల క్యాడర్ ఉద్యోగుల కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా వెంటనే వ్యాక్సిన్ చేయాలని కోరారు .అలాగే కొవిడ్-19 గురైన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో ఆక్సిజన్ తో కూడిన 10% ప్రత్యేక కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కరోన బారినపడి మృతి చెందిన వారి కి కేంద్రం ఇచ్చే 50 లక్షల ఇన్సూరెన్స్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కరోనా ఇన్స్టంట్ 2020 ఏప్రిల్ మే నెల మాత్రమే 10 శాతం ఇచ్చారని తర్వాత కాలంలో ఇవ్వలేదని దానిని కొనసాగించి పెండింగ్లో ఉన్న ఇన్స్టంట్ వెంటనే ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల పని భారాన్ని తగ్గించి వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. టి ఎస్ ఎస్ పి ఎస్ సి ద్వారా 2017 నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయిన వారందరికీ వెంటనే అపార్ట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రతి నెల వేతనాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు.