కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో పని చేస్తున్న 157 మంది స్టాఫ్ నర్సులను గురువారం నాడు అధికారులు తొలగించారు. ముందస్తు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆదిలాబాద్ లో 157 మందిని, రాష్ట్రవ్యాప్తంగా 1640 మందిని తొలగించారు. ఆదిలాబాద్ లో పనిచేస్తున్న 157 మంది స్టాఫ్ నర్సులను నూతనంగా ఏర్పాటు కానున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అవకాశం కల్పించాలనిస్టాఫ్ నర్సులు వీరేందర్, వెంకటేష్ ,రజిత, సంగీత భాయి, భవాని, ప్రమీల, దివ్యవాణి, ప్రభుదాస్లు ప్రభుత్వాన్ని కోరినారు. సోమవారం నాడు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది పాటు ప్రాణాలకు తెగించి కోవిడ్ రోగులకు సేవలు అందించిన తమను ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించిన్దన్నారు. కరోన సోకిన రోగికి బంధువులే రక్తసంబంధీకులు కూడా దగ్గరకు రాలేదని అలాంటి వారికి సేవలు మేము అందించామని తెలిపారు. కోవిడ్ సమయంలో మాత్రం ఎవరికీ తమ ప్రాణాలు గురించి పట్టించుకోలేదని సేవలందించిన మమ్ములను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.