విజయవాడ: తన మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేసిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై రూ.10కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు భాజపా నేత, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని తరలించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందులో భాగంగానే తనకు రాజధాని ప్రాంతంలో భూములున్నాయని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. బినామీ భూములున్నాయంటూ..రాజధానిని తరలించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఒక అడ్రస్ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. రాజధాని అమరావతిని 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధికి, భవిష్యత్కు చిరునామాగా ఆయన అభివర్ణించారు.