ఢిల్లీ : ఈ ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్కీబాత్ రేడియో కార్యక్రమం ద్వారా ప్రసంగించనున్నారు. నేడు జరగబోయే ప్రధాని రేడియో ప్రొగ్రాం 64వ ఎడిషన్. 63వ ఎడిషన్లో కోవిడ్-19 కారణంగా దేశంలో ఏర్పడ్డ పరిస్థితులను ప్రధాని వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 24వ తేదీన దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్న విషయం తెలిసిందే. వైరస్ విజృంభనతో ఈ లాక్డౌన్ను మే 3వ తేదీ వరకు పొడిగించారు. కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ తెలిపిన నివేదిక ప్రకారం దేశంలో 24,942 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 5,210 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. 779 మంది మరణాలు సంభవించాయి.