నాలుగు ప్రాంతాల నుంచే కేసులెక్కువ...
983 కు చేరిన పాజిటీవ్ కేసులు...
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి) : రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా ప్రస్థుత స్థితిపై మంత్రి మీడియా ద్వారా మాట్లాడుతూ... నూతనంగా నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 983కు చేరుకుందని తెలిపారు. వీటిలో 663 యాక్టివ్ కేసులున్నాయన్నారు. కరోనా నుంచి కోలుకొని ఇవాళ 29 మంది డిశ్చార్జీ అవుతున్నట్లు తెలిపారు. బాధితుల్లో ఏడుగురు వెంటిలేటర్పై ఉన్నారన్నారు. కోవిడ్-19 కారణంగా ఇప్పటివరకు 25 మంది మృతిచెందినట్లు పేర్కొన్నారు.
నాలుగు ప్రాంతాల నుంచే కేసులెక్కువ...
రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల నుంచే కరోనా కేసులు ఎక్కువ నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. సూర్యాపేట, గద్వాల, జీహెచ్ఎంసీ, వికారాబాద్ ఈ నాలుగు ప్రాంతాల్లోనే కేసులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. వికారాబాద్లో 14 కుటుంబాల నుంచి 38 మందికి, గద్వాలలో 30 కుటుంబాలలో 45 మందికి, సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి, జీహెచ్ఎంసీ పరిధిలో 44 కుటుంబాల నుంచి 265 మందికి కరోనా సోకినట్లు తెలిపారు.
ఈ రోజు కొత్తగా 13 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు....
983 కు చేరిన పాజిటీవ్ కేసులు.
యాక్టివ్ కేసులు - 663.
291 మందిని డిచ్చార్జ్ చేశాం.
25 మృతి చెందారు.
సూర్యాపేట, గద్వాల, హైదరాబాద్, వికారాబాద్ లలోనే కేసులు ఎక్కువ నమోదు.
కరోనా కట్టడికి అందరు సహకరించాలి.
గాంధీని సంపూర్ణ కరోనా ఆసుపత్రి గా తీర్చిదిద్దాం, ఆహారం బాగాలేదని దుష్ప్రచారం తగదు.
త్వరలో హాట్స్ స్పాట్ జోన్ లలో కేసులు తగ్గుతాయి.
వెంటిలేటర్ పై ఏడుగురు ఉన్నారు.
హైదరాబాద్ లో 44 కుటుంబాల నుండి 265 మందికి కరోనా సోకింది.
గాంధీ ఆసుపత్రి పై దుష్ప్రచారం తగదు.
ప్లాస్మా థెరఫీకి కేంద్రం అనుమతి ఇచ్చింది.