ఢిల్లీలో 162 మంది జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా టెస్ట్...

ఢిల్లీ : దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. వీఐపీలు మొద‌లు సామాన్యుల వ‌ర‌కు అంద‌రిపై త‌న ప్ర‌తాపం చూపిస్తోంది. లాక్‌డౌన్ నేప‌థ్యంలోనూ ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వ‌హిస్తున్న‌ డాక్ట‌ర్లు, ఆస్ప‌త్రి సిబ్బంది, పోలీసులు, మీడియా ప్ర‌తినిధులు, పారిశుద్ధ్య కార్మికుల‌పైనా క‌రోనా పంజా విసురుతోంది.ఢిల్లీలో దాదాపు 160 మంది జ‌ర్న‌లిస్టుల‌ను క‌రోనా అనుమానంతో క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో తాజాగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా వాటిలో క‌రోనా నెగిటివ్ అని తేలడంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. క్వారంటైన్‌లో గ‌డ‌పుతున్న మీడియా ప్ర‌తినిథుల్లో ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ విభాగాలకు చెందిన‌ జ‌ర్న‌లిస్టులు, ఫొటోగ్రాఫ‌ర్లు, కెమేరామెన్లు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.