భారత్‌లో 28వేలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): భారత్‌లో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది.  కొత్తగా నమోదైన కేసులతో కలిపి కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ 28,000 మార్క్‌ను దాటింది. కొత్తగా 1463 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో  సోమవారం సాయంత్రం వరకు మొత్తం కేసుల సంఖ్య 28,380కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.  గడచిన 24 గంటల్లో 60 మంది మరణించారు.


ఇప్పటి వరకు ఇంతలా మరణాలు చోటుచేసుకోవడం ఇదే అధికం.   ప్రస్తుతం 21132 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 6362 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా వల్ల నేటి వరకు 886 మంది చనిపోయారు.