లాక్‌డౌన్‌పై మే 3వ తేదీ తరువాతే నిర్ణయం

ఢిల్లీ, (ఆరోగ్యజ్యోతి):  ముఖ్యమంత్రులతో లక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... మనం కలిసి చేస్తున్న ప్రయత్నాలు ప్రభావ చూపిస్తున్నాయి. కరోనాపై లాక్‌డౌన్‌ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ వల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. వేలమంది ప్రాణాలు రక్షించడంలో ఈ ప్రయత్నాలు చాలా ముఖ్యం. దీనిపై నిరంతరం నిపుణుల సూచనలు తీసుకుంటున్నాం. ఉపాధిహామీ పనులు, కొన్ని పరిశ్రమల పనులు ప్రారంభమయ్యాయ్యాయని తెలిపారు. లాక్‌డౌన్‌పై మే 3వ తేదీ తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రధాని అన్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తి ఉన్నచోట్ల లాక్‌డౌన్‌ కొనసాగుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. కరోనా ప్రభావం తక్కువున్న రాష్ర్టాల్లో, జిల్లాల వారిగా సమీక్షిస్తామని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందవద్దని సీఎంలతో అన్నట్లు తెలిసింది. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని సీఎంలతో మోదీ పేర్కొన్నారు.