ట్రయల్ విజయవంతమైతే 3 వారాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి : ఎస్ఎస్ఐ

పూణే: ట్రయల్స్ విజయవంతమైతే కోవిడ్ -19 వ్యాక్సిన్ మూడు వారాల్లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సిఇఓ అదార్ పూనవాలా తెలిపారు. ఎస్ఐఐ బృందం యూకే లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ హిల్‌తో కలిసి పనిచేస్తోంది. సెప్టెంబర్-అక్టోబర్ నాటికి టీకా మార్కెట్లోకి వస్తుందని ఎస్ఐఐ తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న  క్లినికల్ ట్రయల్స్ విజయవంతమవుతాయని భావిస్తోంది. మేలో భారతదేశంలో ఈ  టీకా పరీక్షలను ప్రారంభించాలని ఎస్ఐఐ భావిస్తోంది. మొదటి 6 నెలలలో  నెలకు 40 నుండి 50 లక్షల మోతాదులను తయారు చేయడమే ఎస్ఐఐ లక్ష్యం. దీని తరువాత, ప్రతి నెలా దీనిని ఒక కోటి మోతాదుకు పెంచవచ్చని భావిస్తోంది. సెప్టెంబరు నాటికి 2 నుండి 4 కోట్ల మోతాదులను ఉత్పత్తి  చేయాలని ఎస్ఐఐ భావిస్తోంది.