రాజస్థాన్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కొత్త కేసులతో పాటు మరణాలు భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా మరో 36 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో హలావర్, జైపూర్లలో తొమ్మిది కాగా, రాగా, టోంక్ 6, జోధ్పూర్ 6, కోటా 4, జైసల్మేర్, భిల్వారా ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదైంది. తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,221కి చేరింది. అటు జైపూర్లో ముగ్గురు కరోనా రోగులు మరణించారు. రాజస్థాన్లో ఇప్పటివరకు 44 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో గత 48 గంటల్లోనే 10 మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఆ రాష్ట్ర వలస కార్మికులను రాజస్థాన్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నారు.