ముంబయి : మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా 6,427 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క ముంబయిలోని 4,025 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 778 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముంబయిలో 522 కేసులు నమోదు అయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 283 మంది చనిపోయారు. నిన్న ఒక్కరోజే 14 మంది కరోనాతో మృతి చెందారు.
ముంబయిలోని ధారవి స్లమ్ ఏరియాలో మరణాల సంఖ్య 13కు చేరింది. అక్కడ 214 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ధారవి స్లమ్ ఏరియాలో సుమారు 8 లక్షల మంది నివసిస్తున్నారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద స్లమ్. కరోనా హాట్స్పాట్గా ముంబయిని కేంద్రం గుర్తించింది. కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. బృహణ్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 813 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.