హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి) : రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం సోమవారం సాయంత్రం గాంధీ హాస్పిటల్ను సందర్శించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, ఇతర విభాగాల వైద్యాధికారులతో సమావేశమైంది.కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో… వైద్యసేవలు, వసతులు, అందుబాటులో ఉన్న శానిటేషన్ సిబ్బంది, పారామెడికల్, సిబ్బంది, సెక్యూరిటీ, వార్డు బాయ్స్ పనితీరు, పి పి ఈ లు, మెడిసిన్స్ లభ్యత గురించి డాక్టర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాంధీ హాస్పిటల్ లో వున్న బెడ్స్, ఐ సి యు బెడ్స్, వెంటిలేటర్లు తదితర అంశాలను వాకబు చేశారు. వైద్యులు, ఇతర సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ… చికిత్స పొందుతున్న కేసులలో 90% మంది ఆరోగ్య స్థితి నార్మల్ గానే ఉన్నట్లు వివరించారు. సిబ్బంది కొరత లేదని తెలిపారు.