న‌ర్సుకు పాజిటివ్‌..ఆస్ప‌త్రి తాత్కాలికంగా సీజ్

ఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో ఇటీవ‌లే కొంత‌మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ సోకిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా హిందూ రావు ఆస్ప‌త్రి లో ప‌నిచేసే న‌ర్సుకు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది.  ఆమెను వెంట‌నే ఐసోలేష‌న్ వార్డుకు త‌ర‌లించారు. ఈ కేసుతో ఉన్న‌తాధికారులు తాత్కాలికంగా హిందూ రావు ఆస్ప‌త్రిని మూసివేశారు. ఆస్ప‌త్రిలో ఉన్న రోగుల కోసం త్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు. ఉన్న‌తాధికారులు స‌ద‌రు న‌ర్సుతో సన్నిహితంగా ఉన్న వారి వివ‌రాలు సేక‌రిస్తున్నారు. శానిటైజేష‌న్ ప్ర‌క్రియ పూర్తి అయిన త‌ర్వాత ఆస్ప‌త్రిని తిరిగి ఓపెన్ చేయ‌నున్నారు.