తిరువనంతపురం (కేరళ): కరోనా వైరస్ నివారణకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఆయూర్ రక్ష’ క్లినిక్ లను ప్రారంభించింది.కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కేరళ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, తాలూకా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆయుర్వేద విభాగం వైద్యుల ఆధ్వర్యంలో ఆయూర్ రక్ష క్లినిక్ లను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ రాకుండా ప్రజల్లో రోగనిరోధక శక్తి పెంచేలా ఆయూర్ రక్ష క్లినిక్ లలో మందులు ఇస్తామని తిరువనంతపురం ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ గోపకుమార్ చెప్పారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఆయుర్వేద వైద్యం చేయాలని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయీ విజయన్ ఆదేశించిన నేపథ్యంలో ప్రజలకు ఆయుర్వేద వైద్యసేవలు అందిస్తున్నామని డాక్టర్ చెప్పారు. కరోనా వైరస్ ను 7 కేటగిరీలుగా విభజించి ఆయుర్వేద మందులు ఇవ్వడం ద్వార రోగుల్లో రోగనిరోధక శక్తిని పెంచుతామని డాక్టర్ గోపకుమార్ వివరించారు.