మందు గోలీలపై నజర్‌

జిల్లాలో మెడికల్‌ షాపులపై నిరంతర నిఘా 


వైద్యుల అనుమతి లేకుండా మందుల విక్రయంపై నిషేధం 


ఆర్‌ఎంపీలు వైద్యం చేయరాదంటూ ఆదేశాలు జారీ


ఆదిలాబాద్‌,(ఆరోగ్యజ్యోతి) : కరోనా వైరస్‌ కట్టడికి వైద్యాధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తు న్నారు. ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసు పత్రులను మూసి వేశారు. అత్యవసరమైతే తప్ప ఓపీ సేవలను పూర్తిగా నిలిపి వేశారు. అయితే కొందరు అను మానిత వ్యక్తులు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితులను కట్టడి చేసేందుకు వైద్యాధికారులు మందు గోలీలపై నజర్‌  పెట్టారు. అనారోగ్యం బారిన పడిన వారిని ముందుగానే గుర్తించేందుకు మెడికల్‌ దుకాణాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. ఇప్పటికే షాపు యజమానులకు అవగా హన కల్పించి మందు గోలీల కోసం వచ్చే వారి వివరాలను నమోదు చేయాలని అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని వైద్యులకు ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. జిల్లాలో మండలాల వారీగా ఉన్న మెడికల్‌ దుకాణాల ద్వారా రోజు వారి సమా చారాన్ని సేకరిస్తూ వైరస్‌ వ్యాప్తిని అంచనా వేస్తున్నారు. 


మెడికల్‌ షాపులపై నిఘా..


జిల్లాలో ఉన్న మెడికల్‌ షాపులపై వైద్యాధికారులు నిరంతరంగా నిఘా సారిస్తున్నారు. దుకాణాల వద్ద భౌతిక దూరాన్ని పాటించాలని నిబంధన విధిస్తూనే నిత్యం షాపుకు వచ్చి పోయే వారిపై నిఘా పెడుతున్నారు. ప్రతీ మెడికల్‌ షాపు వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు.


ముఖ్యంగా ప్యారసిటమల్‌, జలుబు, దగ్గు సంబంధిత మందుల కోసం వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నారు. వారి పేరు, చిరునామా, సెల్‌ నెంబర్‌ను నమోదు చేసుకొని మందులు విక్రయించాలని యజమానులకు చెబుతున్నారు. మరీ అనుమానం వస్తే వైద్యులకు వెంటనే సమాచారం అందించాలని కోరుతు న్నారు. దగ్గు, జ్వరం, జలుబు లాంటి లక్షణాలతో మెడికల్‌ షాపుకు వస్తే అందుబాటులో ఉన్న వైద్యుడికి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ మండలా ల్లోని మెడికల్‌ షాపులను నిత్యం తనిఖీలు చేస్తూ మందుల విక్రయాలపై ఆరా తీస్తున్నారు. 


ఆర్‌ఎంపీలకు హెచ్చరికలు..


గ్రామాల్లో వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కరోనా పరిస్థితులు పూర్తిగా సద్దుమని గేంత వరకు ఎలాంటి వైద్యం చేయరాదని చెబుతున్నారు. ఏదైనా అనుమానం వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి రోగులను పంపాలని సూచిస్తున్నారు.


వైద్యుల అనుమతి తప్పనిసరి..


మందులు అత్యవసరమైతే వైద్యుడి అనుమతులు తప్పని సరిగా ఉండాలి. వైద్యులు ఇచ్చే ప్రిస్కిప్షన్‌ ఆధారంగా మెడికల్‌ దుకాణాల యజమానులు మందులు అంద జేయాల్సి ఉంటుంది. రోగి ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నాడనే విషయాన్ని వైద్యులు తప్పని సరిగా పేర్కొనాల్సి ఉంటుంది. అయితే కొందరు కరోనా భయంతో వైద్యుల వద్దకు వెళ్లకుండా నేరుగా మెడికల్‌ షాపులోనే మందులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో మెడికల్‌ షాపు యజమాని ఇచ్చే పరోక్ష సమాచారంతో రోగిని వైద్య సిబ్బంది గుర్తిస్తూ పరీక్షలు చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.


జ్వరం మందుల కోసం వస్తే తెలియజేయాలి..:


డా. మనోహర్‌ (డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో, ఉట్నూర్‌)


జలుబు, జ్వరంతో బాధపడుతూ మెడికల్‌ షాపులకు మందుల సం వస్తే వారి పేర్లను రిజిస్టర్లలో రాసి సంబంధిత వైద్యాధికారులకు తెలియజేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ కుడిమెత మనోహర్‌ అన్నారు. సోమవారం ఇంద్రవెల్లి, ఉట్నూర్‌ మండల కేంద్రాల్లోని మెడికల్‌ షాపులను సందర్శించి తనిఖీ చేశారు. జలుబు, జ్వరం మాత్రల కోసం  వచ్చే వారి వివరాలను డాక్టర్లకు తెలియజేయడం ద్వారా కరోనా వైరస్‌ ప్రబలకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.