న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి) : కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టుల కోసం చైనా నుంచి భారీగా కిట్స్ దిగుమతి చేసుకోగా వాటిని మళ్లీ వెనక్కి పంపించేందుకు చర్యలు చేపట్టింది. చైనా టెస్టింగ్ కిట్స్ లో లోపాలు తలెత్తుతున్నాయన్నా ఆరోపణ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చైనా టెస్టింగ్ కిట్స్ను వెనక్కి పంపాలని అన్ని రాష్ట్రాలను ICMR కోరింది. అటు దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా మెరుగుపడుతోందని కేంద్రం తెలిపింది. రికవరీ రేటు 22.71శాతంగా ఉందని ప్రకటించింది.