ఉట్నూర్ (ఆరోగ్యజ్యోతి): మండలంలోని హస్నాపూర్లో జరుగుతున్న ఇంటిం టి సర్వేలో వైద్య పరీక్షలు పూర్తి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ కుడిమెత మనోహర్ అన్నారు. బుధవారం హస్నాపూర్ పీహెచ్సీలో ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని హస్నాపూర్, చాందూరి, ఉట్నూర్లలో కాంటాక్టు కేసులు వచ్చినందున వారి ని హోంక్వారెంటెన్లో ఉంచుతున్నప్పుడు వారికి రోజు వారిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, వారు బయటకు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు. హస్నాపూర్ లో 711 కుటుంబాలకు ఆరోగ్య పరీక్షలు పూర్తి చేయాలన్నారు.