న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి) : కరోనా మహమ్మారి మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో అత్యధికంగా ప్రభావం చూపుతున్నది. దేశరాజధాని ఢిల్లీతోపాటు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు శరవేగంగా పెరుగుతున్నది. భారత వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రానికి మహారాష్ట్రలో 8,068, గుజరాత్లో 3,301, ఢిల్లీలో 2,918 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ తర్వాత స్థానాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య వేగంగానే పెరుగుతున్నది. ఆదివారం సాయంత్రానికి రాజస్థాన్లో 2,185, మధ్యప్రదేశ్లో 2,096, తమిళనాడులో 1,885, ఉత్తరప్రదేశ్లో 1,868 కేసులు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో 1,097కు, తెలంగాణలో 1,002కు చేరింది.