నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన టి.ఆర్.ఎస్. నాయకులు వనమా రాఘవ

కొత్తగూడెం,(ఆరోగ్యజ్యోతి):పాల్వంచ మండల పరిధిలోని సంగెo గ్రామంలో కరోనా లాక్ డౌన్ సందర్బంగా బాధితులైన పేద ప్రజలకు జిల్లా టి.ఆర్.ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. సంగెo గ్రామానికి చెందిన ప్రముఖ టి.ఆర్.ఎస్ నాయకులు  ఆచార్యులు, రామానుజాచార్యులు,  శేషాచార్యులు,  వేణుగోపాలాచార్యులు ల నేతృత్వంలో సుమారు 35 వేల విలువ గల నిత్యావసర వస్తువులు, కూరగాయలు 200 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డి.సి.ఎం.ఎస్ ఉపాధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ టి.ఆర్.ఎస్. నాయకులు కిలారు నాగేశ్వరరావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మల్లెల శ్రీరామ్మూర్తి, పోలెబోయిన వీర్రాజు, చిన్న పండు, సంగెo గ్రామ సర్పంచ్ ఎం.డి.మక్బుల్, గ్రామస్తులు అప్పోజు సత్యనారాయణ, కిరణ్, సొసైటీ డైరెక్టర్ చౌగాని పాపారావు తదితరులు పాల్గొన్నారు.