నిత్యావసరాల సరుకులు అందుబాటులో
కంటైన్ మెంట్ ప్రాంతాల్లో నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయి,
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు గత మూడు వారాలుగా తగ్గుముఖం పట్టి, వరుసగామూడు రోజుల నుండి కొత్తగా ఒక్క కేసు నమోదు కాకపోవడంతో జిల్లా ప్రజలు విజయవంతంగాభావించ వచ్చని జిల్లా కలెక్టర్ ఏ.శ్రీదేవసేన్, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఒక ప్రకటనలో తెలిపారు.శనివారం సంయుక్తంగాఓ ప్రకటన విడుదల చేస్తూ నూతన స్వల్ప సడలింపులపై వివరాలను వెల్లడించారు, నేటి నుండి పట్టణంలో లాక్ డౌన్ ఆంక్షలను స్వల్పంగా సవరిస్తున్నట్లు వెల్లడించారు, పట్టణంలో కంటైన్ మెంట్ ప్రాంతాల మినహా మిగిలిన సాధారణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు, ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ప్రజలను కోరారు, ఆంక్షలపై వెసులుబాటు కలగడంతో ప్రజలు తొందర పడకుండా ప్రశాంతంగా సామాజిక దూరాన్ని పాటిస్తూ, తప్పనిసరిగా మాస్కులు ధరించి నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు కొనుగోలు చేయవచ్చని సూచించారు, ప్రతి ఒక్కరూ జిల్లా యంత్రంగానికి సహకరించాలని కోరారు.