1జీబీ డాటా రూ.4కే

న్యూఢిల్లీ ఇంటర్నెట్‌ డాటాను అధికంగా ఉపయోగించే వినియోగదారుల కోసం రూ.999 ధరతో సరికొత్త ‘వర్క్‌ ఫ్రం హోం’ ప్లాన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు రిలయన్స్‌ జియో శుక్రవారం ప్రకటించింది. 84 రోజులపాటు చెల్లుబాటయ్యే ఈ ప్లాన్‌లో వినియోగదారులకు రోజూ 3జీబీ చొప్పున డాటా, 100 ఎస్‌ఎంఎస్‌లతోపాటు జియో నుంచి జియో నంబర్లకు, జియో నుంచి ల్యాండ్‌లైన్‌ నంబర్లకు ఉచితంగా అపరిమిత వాయిస్‌కాల్స్‌ను అందజేయనున్నట్టు తెలిపింది. అంటే ఈ ప్లాన్‌లో 1 జీబీ డాటా దాదాపు రూ.4కే లభిస్తుంది.