న్యూఢిల్లీ, (ఆరోగ్యజ్యోతి): విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ప్రాధాన్యతా క్రమంలో రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. ప్రవాసీయులను విమానాలు, నౌకల ద్వారా తీసుకొచ్చే కార్యక్రమం గురువారం మొదలవుతుందన్నారు. స్వదేశానికి రావడానికి 1.90 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. తొలి దశలో అమెరికా, బ్రిటన్, సింగపూర్ సహా 12 దేశాల నుంచి మనవాళ్లను తీసుకొస్తామన్నారు. వారంతా కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలని తెలిపారు. భారత్ వచ్చిన తర్వాత వారు 14 రోజుల క్వారంటైన్కు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.