న్యూఢిల్లీ: ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు పది లక్షల మంది కార్మికులను వారి స్వస్థలాలకు చేరవేశామని రేల్వే శాఖ ప్రకటించింది. పొట్టకూటి కోసం వలస వెల్లిన కార్మికులు కరోనా లాక్డౌన్తో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. దీంతో తమ సొంతూర్లకు వెల్లడానికి కాలిబాట పట్టారు కార్మికులు. ఈ నేపథ్యంలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లడానికి కేంద్రప్రభుత్వం అనుమతించింది. ఇందులో భాగంగా కార్మిక దినోత్సవమైన మే 1 నుంచి శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో వారిని తరలిస్తున్నది. దీంతో గత 15 రోజులుగా సుమారు ఎనిమిది వందల శ్రామిక్ రైళ్లలో 10 లక్షల మంది కార్మికులను వారి సొంత రాష్ర్టాలకు చేరవేశామని భారతీయ రైల్వే వెల్లడించింది. అదేవిధంగా మొదటి ఏసీ ప్యాసింజర్ రైలు ఈ రోజు కోల్కతా చేరింది.