ఇప్పటివరకూ 1107233 కరోనా టెస్టులు చేశాం: ఐసీఎమ్ఆర్

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకూ 1107233 టెస్టులు నిర్వహించామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ తెలిపింది. మరోవైపు దేశంలో రికవరీ రేటు 27.52 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో 2553 కొత్త కేసులు నమోదు కాగా 72 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 42,533కు చేరింది. 1372 మంది చనిపోయారు. 11,707 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో 12,296 మందికి కరోనా సోకింది. 521 మంది చనిపోయారు. గుజరాత్‌లో 5055 మందికి కరోనా సోకగా 262 మంది మృతి చెందారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 4122కు చేరింది. 64 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌లో 4122 కేసులు నమోదయ్యాయి. 156 మంది చనిపోయారు.