న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 115 శ్రామిక్ రైళ్లను నడిపినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ నెల 1 నుంచి బుధవారం వరకు లక్ష మందికిపైగా వలస కూలీలను వారి స్వస్థలాలకు తరలించినట్లు వివరించింది. బుధవారం రాత్రి మరో 22 రైళ్లు కూలీలతో బయల్దేరతాయని వెల్లడించింది.