- 200 కి.మీ నడిచి స్వగ్రామానికి చేరిన వలస కూలీ
- ఊళ్లోకి ప్రవేశించనివ్వని గ్రామస్థుల
జైపూర్, మే 5: కమలేశ్ మీనా రాజస్థాన్కు చెందిన ఓ వలస కూలీ. లాక్డౌన్ కారణంగానే తను పనికోసం వెళ్లిన అజ్మీర్ జిల్లాలో ఉండిపోవాల్సి వచ్చింది. లాక్డౌన్ అయిపోయిన తర్వాత స్వగ్రామానికి వెళ్లాలనుకున్నాడు. అయితే లాక్డౌన్ను పొడిగించడంతో.. సుమారు 200 కిలోమీటర్ల దూరంలో భిల్వారా జిల్లాలోని తన స్వగ్రామం షేర్పురాకు గత నెల 16న నడిచి బయలుదేరాడు. ఎట్టకేలకు గ్రామానికి చేరినా.. సరిహద్దుల్లోనే గ్రామస్తులు అతడిని ఆపి, వైద్య సిబ్బందితో పరీక్షలు నిర్వహించారు. వైద్యసిబ్బంది క్వారంటైన్ కేంద్రానికి రావాలని కమలేశ్ను కోరినా అతడు నిరాకరించాడు. దీంతో గ్రామస్థులు అతడికి సరిహద్దుల్లో చెట్టుపై వెదురుకర్రలతో నివాసం ఏర్పరచుకునేందుకు అనుమతినిచ్చారు. తన కుటుంబసభ్యులు రోజూ ఆహారం అందించగా.. కమలేశ్ 14రోజుల పాటు చెట్టుపైనే ఉండి క్వారంటైన్ కాలాన్ని పూర్తి చేసి, తన ఊళ్లోకి అడుగుపెట్టాడు.