పాల్వంచ,(ఆరోగ్యజ్యోతి): 14 వ వార్డులోని పేదలకు TRS సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కిలారు ప్రజా కార్యాలయం వద్ద 25 మంది పేద కుటుంబాలకు పాల్వంచ కోపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ ,TRS నాయకులు కనగాల బాలకృష్ణ , కనగాల నారాయణ ల సహకారంతో బియ్యం, కూరగాయలు, 100 రూపాయలు నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిలారు నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వలన చాలా మంది పేదలు ఇల్లు గడవక ఇబ్బంది పడుతున్నారని అలాంటి వారిని ఆదుకోవడానికి సమాజంలోని ఉన్నటువంటి దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్, TRS నాయకులు మహిపతి రామలింగం, కనగాల బాలక్రిష్ణ, మల్లెల రవిచంద్ర, కాల్వ ప్రకాష్, మేడిద సంతోష్ గౌడ్, కనగాల నారాయణ, దాసరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.