న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉద్యోగుల పని విషయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై యేడాదికి 15 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసుకునేలా ఓ డ్రాఫ్ట్ను రూపొందించినట్లు సమాచారం. వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఈ డ్రాఫ్ట్ రూపకల్పన జరిగిందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ‘‘కేంద్ర సచివాలయంలో సామాజిక దూరం కొనసాగించడంతో పాటు పని వేళల్లో మార్పులు... ఇతరత్రా అవసరాల దృష్ట్యా సమీప భవిష్యత్తులో ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి’’ అని డ్రాఫ్ట్లో పేర్కొన్నారు.