అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16 వందలకు చేరువైంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 58 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1583కు చేరింది. ఈ ప్రాణాంతక వైరస్తో రాష్ట్రంలో ఇప్పటివరకు 33 మంది బాధితులు మరణించారు. రాష్ట్రంలో ఇంకా 1,062 యాక్టివ్ కేసులు ఉండగా, 488 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో కర్నూలులో అత్యధికంగా 30 ఉండగా, గుంటూరులో 11, కృష్ణా జిల్లాలో 8, అనంతపురంలో 7, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రధాన కేంద్రంగా మారిన కర్నూలు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 466కు చేరగా, తర్వాతి స్థానంలో ఉన్న గుంటూరులో కేసుల సంఖ్య 319కి చేరింది.