ఒకరి మృతి.. 35 మంది డిశ్చార్జి
1,061కి పెరిగిన మొత్తం కేసులు
హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం మరో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,061కి చేరింది. మరణాల సంఖ్య 29కి పెరిగింది. తాజాగా నమోదైన 17 కేసుల్లో 15 హైదరాబాద్లోవి కాగా.. మరో రెండు కేసులు రంగారెడ్డిలో నమోదయ్యాయి. కొవిడ్ నుంచి కోలుకొని శనివారం 35 మంది డిశ్చార్జి అయ్యారు. వారిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి 24 మంది, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల నుంచి 8 మంది, ఆసిఫాబాద్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రాష్ట్రంలో వైరస్ నుంచి ఇప్పటివరకు మొత్తం 499 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 533 యాక్టివ్ కేసులున్నాయి.
యువతలోనే ఎక్కువ మందికి వైరస్
రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొవిడ్ బారిన పడ్డవారిలో 21ు మంది 21-30 ఏళ్ల మధ్య వయసు వారే ఉన్నారు. రాష్ట్రం లో నమోదైన కేసుల్లో 705 మంది పురుషులు, 356మంది మహిళలు ఉన్నారు.
14 రోజుల నుంచి ఒక్క కేసు లేదు
ములుగు, భూపాలపల్లి, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్కర్నూల్, పెద్దపల్లి, సిద్దిపేట, మంచిర్యాల, మహబూబాబాద్, భద్రాద్రి, నారాయణపేట జిల్లాల్లో 14రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.
వయసు కేసుల్లో శాతం
0-5 5
6-10 4
11-20 13
21-30 21
31-40 19
41-50 15
51-60 14
61-70 7
71-80 2