క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలి


 -జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్
 ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ మెట్పల్లివార్  అన్నారు. శనివారం నాడు ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్, హమాలివాడ పట్టణ ఆరోగ్య కేంద్రలను  ఆయన సందర్శించారు. పిల్లలకు గర్భవతులకు వ్యాధి నిరోధక టీకాలు ఏ విధంగా అందుతున్నాయో పరిశీలించారు. కోల్డ్   సిస్టం ఏ విధంగా పనిచేస్తుందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని  సిబ్బందికి  తెలిపారు. కరోనా వైరస్ ఉండటం వల్ల రెండు నెలల పాటు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడంలో కొద్దిగా ఆలస్యం జరిగిందని, ఇప్పుడు పిల్లలందరికీ క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని సూచించారు. వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. పిల్లలకు టీకాలు ఇవ్వడంతోపాటు రిజిస్టర్లు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.