- సీఎం కేసీఆర్కు టీయూడబ్ల్యూజే వినతి
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): కరోనా కష్టకాలంలో జర్నలిస్టులను ఆదుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కోరినారు.ఈ మేరకు సోమవారం సంఘం ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్, చిన్నపత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్బాబు తదితరులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిసి 12 అంశాలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. కొన్ని సంస్థల్లో యాజమాన్యాలు వేతనాల్లో కోత విధించడం వల్ల జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపినారు.అల్లం నారాయణ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇళ్ల స్థలాల విషయంలో కోర్టు ఇబ్బందులు తొలగించి అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపినారు. ఇంకా నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని మీ సమస్యలు అన్నీ పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే సెక్రటేరియట్ నాయకులు విజయసారధి, మొహమ్మద్ సాదిక్ పాషా, నాయకులు పులిపాటి దామోదర్, భూపాల్ రెడ్డి, పలువురు సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.