ఇదో రికార్డు.. మార్చి నుంచి డిసెంబరు దేశంలో 2 కోట్ల జననాలు!


- శిశువులు, గర్భిణులు ఇబ్బందులు 


- యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యూనిసెఫ్)యునైటెడ్ నేషన్స్


మార్చిలో కోవిడ్-19ను మహమ్మారిగా ప్రకటించిన తర్వాత 9 నెలల కాలంలో అంటే మార్చి నుంచి డిసెంబరు మధ్యకాలంలో భారతదేశంలో 2 కోట్ల మంది జన్మించే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోయిన వైద్య సేవలు, అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జన్మించే శిశువులు, గర్భిణులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యూనిసెఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 116 మిలియన్ల మంది జన్మించే అవకాశం ఉందని యూనిసెఫ్ అంచనా వేసింది. మార్చి 11న కోవిడ్-19ను మహమ్మారిగా ప్రకటించిన తర్వాత 40 వారాల్లో వీరంతా జన్మించే అవకాశం ఉందని అంచనా.ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా భారత్‌లోనే ఎక్కువ జననాలు సంభవించే అవకాశం ఉందని యూనిసెఫ్ పేర్కొంది. మార్చి 11-డిసెంబరు 16 మధ్య ఇండియాలో 20.1 మిలియన్ల మంది పుడతారని అంచనా. ఆ తర్వాతి స్థానంలో చైనా (13.5 మిలియన్లు), నైజీరియా (6.4 మిలియన్లు), పాకిస్థాన్ (5 మిలియన్లు), ఇండోనేషియా (4 మిలియన్లు) ఉన్నట్టు యూనిసెఫ్ తెలిపింది. ఈ ఏడాది జనవరి-డిసెంబరు మధ్య ఇండియాలో 24.1 మిలియన్ల మంది జన్మించే అవకాశం ఉందని యూనిసెఫ్ పేర్కొంది.