పుణే: మహారాష్ట్రలోని పుణే ఆటో డ్రైవర్ అక్షయ్ కొత్వాలే, వలస కార్మికుల దీనస్థితితో చలించిపోయి.. వారికి ఆహారం అందించాలనుకున్నాడు. ఈ నెల 25 జరుగాల్సిన అక్షయ్ పెండ్లి వాయిదా పడింది. దీంతో పెండ్లికి దాచుకున్న 2 లక్షలతో వారి ఆకలి తీరుస్తున్నాడు. తన మిత్రులతో కలిసి రోజూ ఆహారం తయారు చేసి ఆటోలో తిరుగుతూ వలస కూలీలకు అందిస్తున్నాడు.