మే 21 నుంచి రోడ్డెక్కనున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు.. టికెట్లు మాత్రం...


అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయి. మే 21 నుంచి బస్సులను నడపాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌ను ఏపీఎస్‌ఆర్టీసీ ప్రారంభించింది. అయితే.. ఆర్డినరీ బస్సులకు కూడా టికెట్లను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించడం కొసమెరుపు.అయితే.. స్పందన పోర్టల్‌లో మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకున్న వారికే ఏపీఎస్‌ఆర్టీసీలో టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించడం గమనార్హం. ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది.