24 గంట‌ల్లో 108 కేసులు..11 మంది మృతి

పశ్చిమ‌బెంగాల్ లో క‌రోనా పాజిటివ్ కేసులు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కేవ‌లం ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే 108 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 24 గంట‌ల్లో 11 మంది మృతి చెందార‌ని ఆ రాష్ట్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అల‌ప‌న్ బందోపాధ్యాయ్ తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1786కు చేరు‌కుంది.మొత్తం కేసుల్లో 1243 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. క‌రోనా బారిన ప‌డి మొత్తం 99 మంది చ‌నిపోయార‌ని వెల్ల‌డించారు. మ‌రోవైపు క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాలు, కంటైన్ మెంట్ జోన్ల‌లో పోలీసులు లాక్ డౌన్ రూల్స్ క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. నిత్య‌వ‌స‌ర స‌రుకులు ఇంటివ‌ద్ద‌కే పంపిణీ చేస్తున్నారు.