న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 3,390 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 1,273 మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం రికవరీ రేటు 29.36కు చేరింది. దేశంలో ఇప్పటివరకూ 56,342 కేసులు నమోదయ్యాయి. 16,540 మంది రికవర్ అయ్యారు. 1,886 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. రైల్వే శాఖ సహకారంతో ఇప్పటివరకూ 5,231 రైల్వే కోచ్లను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చామని లవ్ అగర్వాల్ చెప్పారు. 250 స్టేషన్లలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. స్వల్పంగా కరోనా లక్షణాలున్న వారికి ఈ కేంద్రాల్లో చికిత్స అందించాలని నిర్ణయించినట్లు లవ్ అగర్వాల్ చెప్పారు.