రాష్ట్ర‌ప‌తి వేత‌నంలో 30 శాతం పీఎం కేర్స్‌కువిరాళం

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డంలో ఆర్థిక సాయం కోసం ఉద్దేశించిన పీఎం కేర్స్ నిధికి విరాళాల పరంప‌ర కొన‌సాగుతున్న‌ది. తాజాగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ త‌న వార్షిక వేత‌నంలో 30 శాతాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా, రాష్ట్ర‌ప‌తి ఇప్ప‌టికే ఒక‌సారి పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అంద‌జేశారు. మార్చి నెలకు సంబంధించిన త‌న పూర్తి వేతానాన్ని పీఎం కేర్స్ నిధికి జ‌మ‌చేశారు. తాజాగా త‌న వార్షిక వేత‌నంలో సైతం 30 శాతాన్ని విరాళంగా ఇవ్వ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.