300 మంది యాత్రికుల్లో 76 మందికి పాజిటివ్

అమృత్ స‌ర్: పంజాబ్ లో 23 మంది యాత్రికుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయిన విష‌యం తెలిసిందే. అయితే మొత్తం 300 మంది యాత్రికుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 76 మందికి క‌రోనా పాజిటివ్ గా తేలింద‌ని తెలిపారు. ఇటీవ‌‌లే 300 మంది యాత్రికులు మ‌హారాష్ట్ర లోని శ్రీ హ‌జుర్ సాహిబ్ నుంచి పంజాబ్ (అమృత్ స‌ర్ ) కు రాగా వారికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. వారిలో 76 మందికి క‌రోనా పాజిటివ్ గా తేలింది. అంద‌రినీ గురునాన‌క్ దేవ్ ఆస్ప‌త్రి తో పాటు మ‌రిన్ని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి..ప్ర‌త్యేక ఐసోలేష‌న్‌లో చికిత్స కొన‌సాగిస్తున్న‌ట్లు పంజాబ్ వైద్య‌ విద్యా, ప‌రిశోధ‌నా శాఖ మంత్రి ఓం ప్రకాశ్ సోని తెలిపారు. యాత్రికుల‌తో స‌న్నిహితంగా ఉన్న‌వారి వివ‌రాలు సేకరిస్తున్నామ‌న్నారు.