హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి) : తెలంగాణలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వారం రోజులుగా కొంచెం తక్కువగా నమోదయినప్పటికీ తాజాగా ఈ సంఖ్య పెరిగింది. తెలంగాణలో ఇప్పవరకూ 1,163 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. శనివారం ఒక్కరోజే 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు స్పష్టం చేసింది. 30 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు అయినట్లు వెల్లడించింది. ఓ వలస కూలీకి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపింది. మొత్తం 382 కేసులు యాక్టివ్గా ఉన్నాయని, 751 మంది డిశ్చార్జి అయ్యారని ప్రకటించింది. కరోనాతో 30 మంది చనిపోయినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ తన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.