మే 31వ తేదీ వ‌ర‌కు రైళ్లు న‌డ‌పద్దు: త‌మిళ సీఎం

చెన్నై:  మే 31వ తేదీ వ‌ర‌కు ప్యాసింజ‌ర్ రైలు స‌ర్వీసులు తిర‌గ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్నామ‌ని త‌మిళ‌నాడు సీఎం ప‌ల‌నిస్వామి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో తెలిపారు. క‌రోనావైర‌స్ కేసుల సంఖ్య 7,000 మార్కును దాటిన రాష్ట్రాల్లో నెల చివ‌రి వ‌ర‌కు రెగ్యుల‌ర్ ఎయిర్ స‌ర్వీసులను, రైళ్ల‌ను అనుమ‌తించ‌వ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రులు కోరారు. మే 12వ తేదీ నుంచి చెన్నై నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి చెన్నైకి సాధార‌ణ రైలు స‌ర్వీసులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని మాకు తెలుసు. చెన్నైలో కేసులు పెరుద‌ల రేటు ఎక్కువ‌గా ఉన్నందున రైలు సేవ‌లు అనుమ‌తించ‌వ‌ద్ద‌ని ప్ర‌ధానికి విజ్ఞ‌ప్తి చేశారు. 54 రోజుల దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ ముగిసే స‌మ‌యానికి కోవిడ్‌-19 నిరోధానికి వ్యూహం, రాష్ట్రాల ఆర్థిక‌ప‌రిస్థితిపై ప్ర‌ధాని మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. కోయంబేడులోని హోల్‌సెల్ కూర‌గాయ‌ల మార్కెట్ ప్ర‌ధాన హాట్‌స్ప‌ట్‌గా కేసుల సంఖ్య‌ను పెరుగుతున్న విష‌యాన్ని ప్ర‌ధానికి వివ‌రించాన‌ని వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం నుంచి 15 రైళ్లు దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు న‌డుస్తాయ‌ని రైల్వేశాఖ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.