పుణె: దేశంలో కరోనాకు కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో ముంబై తర్వాత కరోనా వైరస్తో అత్యంత ప్రభావితమైన జిల్లా పుణె. తాజాగా ఆ జిల్లాలో శనివారం ఉదయం 68 ఏండ్ల వృద్ధుడు వైరస్ ప్రభావంతో మరణించారు. దీంతో పుణెలో కరోనా మృతుల సంఖ్య వందకు చేరింది. అదేవిధంగా కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, మొత్తంగా 1828 కరోనా కేసులు రికార్డయ్యాయి. జిల్లాలోని ససూన్ జనరల్ హాస్పిటల్లో అత్యధికంగా 62 మంది కరోనా వైరస్తో మరణించారు.