ఢిల్లీలో పెరిగిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నానికి అందిన సమాచారం మేరకు కొత్తగా 425 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీలో మొత్తం 8895 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ సర్కారు తెలిపింది. కరోనా వల్ల ఇప్పటి వరకు 123 మంది చనిపోయారు. 5254 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది.