భారత్‌లో 40వేలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 40వేలు దాటాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 2487 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా..83 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 40,263కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 28,070 మంది చికిత్స పొందుతున్నారు.  10887 బాధితులు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇవాళ్టి వరకు 1306 మంది కరోనా వల్ల చనిపోయారు.