హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1367కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 394. వ్యాధి నుంచి కోలుకుని నేడు 117 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19 నుంచి ఇప్పటివరకు మొత్తం 939 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. వ్యాధి కారణంగా ఇప్పటి వరకు 34 మంది మరణించారు. నేడు జీహెచ్ఎంసీ పరిధిలో 31 కేసులు నమోదు కాగా వలస కార్మికులు 10 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.