వాషింగ్టన్: ప్రపంచం చుట్టూ కొమ్ముల కంచె వేసేస్తోంది కరోనా మహమ్మారి. ఎన్ని చేస్తున్నా కంట్రోల్లోకి రాకుండా మొండిఘటంలా మారుతోంది. లాక్డౌన్లు పెట్టినా, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నా, చేతులు శుభ్రంగా కడుగుతున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేసులు 41 లక్ష దాటిపోయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ‘మిలియన్’ మార్కును అందుకోవడానికి చాలా తక్కువ టైం తీసుకుంటోంది. ఇప్పటిదాకా మొత్తం 4,100,609 మంది దాని బారిన పడ్డారు. 2,80,431 మంది చనిపోయారు. 14,39,842 మంది కోలుకున్నారు.ఫస్ట్ కేసు డిసెంబర్ 19న రిపోర్ట్ అయిందనుకుంటే.. అక్కడి నుంచి ఫస్ట్ పది లక్షల కేసులు నమోదవడానికి పట్టిన టైం 106 రోజులు. అంటే మూడు నెలలకుపైనే. కానీ, అక్కడి నుంచి సీన్ రివర్స్ అయిపోయింది. చాలా స్పీడ్గా కేసులు పెరిగాయి. రెండో మిలియన్ కేసులు నమోదవడానికి పట్టిన టైం 12 రోజులు. మూడో మిలియన్కు 13 రోజులు పట్టింది. నాలుగో మిలియన్ కేసులు నమోదవడానికి తీసుకున్న టైం జస్ట్ 11 రోజులే. ఇలాంటి టైంలోనే కొన్ని దేశాలు లాక్డౌన్ను ఎత్తేశాయి. మరికొన్ని ఎత్తేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సిచువేషన్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి మరింత చేజారిపోయే ప్రమాదం లేకపోలేదు. కేసులు స్టార్ట్ అయిన రోజు నుంచి ఇప్పటిదాకా రోజూ సగటున 28,423 కేసులు నమోదయ్యాయి. కానీ, ఫస్ట్ మిలియన్ దాటిన తర్వాతి నుంచి లెక్కలు తీస్తే.. 36 రోజుల్లో సగటున రోజూ 84,616 కేసుల చొప్పున 30,46,178 కేసులు రికార్డయ్యాయి.